ఎస్ రాయవరం మండలం దార్లపూడి సమీపన పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ ను గురువారం మధ్యాహ్నం 12గంటలకు సీఎం చంద్రబాబు నాయుడు పరిశీలించారు. ముందుగా దార్లపూడిలో అసంపూర్తిగా నిలిచిపోయిన లెఫ్ట్ మెయిన్ కెనాల్ ను ఆయన పరిశీలించిన అనంతరం, అందుకు సంబంధించిన మ్యాపులను పరిశీలించారు. పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ అధికారులు చంద్రబాబుకు కాలువ గురించి వివరించారు. ఎంపీ సీఎం రమేష్, మంత్రులు రామానాయుడు, అనిత పాల్గొన్నారు.