శారదా నదిలో కొట్టుకొచ్చిన మృతదేహం

రాంబిల్లి మండలం నారాయణపురం శారదా నదిలో మృతదేహం మంగళవారం కొట్టుకొచ్చింది. స్థానికుల సమాచారంతో రాంబిల్లి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని బయటకు తీసి మృతుడిని కట్టుపాలెం గ్రామానికి చెందిన రేవాడ అప్పారావు (65)గా గుర్తించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్