అనంతపురం నగరంలో ఆదివారం వైసీపీ పార్టీ 'బీసీ గళం' కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా అనంతపురం జిల్లా వైయస్సార్ సీపీ అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ, బీసీలు అంటే బ్యాక్వర్డ్ కాదని, వెన్నెముక అని చాటి చెప్పిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. 2019 ఎన్నికల సమయంలో బీసీ గర్జనలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలన్నింటినీ అధికారంలోకి వచ్చాక అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఆయనేనని గుర్తు చేశారు.