అనంతపురం జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోవాలని జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ సి. విష్ణు చరణ్ తెలిపారు. పరిష్కారం కాని అర్జీలపై వివరాలు తెలుసుకోవడానికి 1100కు కాల్ చేయవచ్చన్నారు. అర్జీలు meekosam. ap. gov. in వెబ్సైట్లో నమోదు చేయవచ్చన్నారు. ఫిబ్రవరి 02న అనంతపురం కలెక్టరేట్లో ఉదయం 9 నుంచి పీజీఆర్ఎస్ కార్యక్రమం ఉంటుందన్నారు.