సోమవారం అనంతపురంలోని రాజీవ్ కాలనీ పంచాయతీలో గల మరాఠీ కాలనీలో, స్థానిక టిడిపి నాయకులు, అధికారులతో కలిసి అనంతపురం శాసనసభ్యులు దగ్గుపాటి ప్రసాద్ లబ్ధిదారులకు ఎన్టీఆర్ సామాజిక భద్రత పింఛన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయని తెలిపారు.