అనంతపురం నగరంలోని కమలానగర్ లోని రఘువీర టవర్స్ లో టిడిపి నాయకుడు విక్రమ్ సింగ్ పురోహిత్ మరియు శోభా శారీస్ గ్రూప్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని అనంతపురం శాసనసభ్యులు దగ్గుపాటి ప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన నిర్వాహకులను అభినందించారు. ప్రజలకు అవసరమైన వైద్య సేవలను అందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని ఆయన అన్నారు.