అనంతపురం అర్బన్ టిడిపి కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించిన అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారు, ఏ పార్టీ వారికైనా అర్హత ఉంటే సంక్షేమ పథకాలు అందిస్తామని స్పష్టం చేశారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి, కొన్ని సమస్యలకు తక్షణ పరిష్కారం చూపాలని అధికారులకు ఆదేశించారు. ఇప్పటివరకు 45 గ్రీవెన్స్ లు నిర్వహించి 1026 అర్జీలు స్వీకరించగా, 997 అర్జీలకు పరిష్కారం చూపించామని, మిగిలినవి వివిధ దశలలో ఉన్నాయని తెలిపారు. సమస్యలు ఎందుకు పరిష్కారం కాలేదో ప్రజలకు వివరిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.