ఉరవకొండ: భారీ వర్షానికి నీట మునిగిన చేనేత మగ్గాలు

ఉరవకొండ నియోజకవర్గంలో సోమవారం మధ్యాహ్నం నుంచి కురిసిన భారీ వర్షం జనజీవనాన్ని స్తంభింపజేసింది. ఇందిరానగర్, ఈశ్వరమ్మ, శివరామిరెడ్డి కాలనీలలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అనేక ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఈ వర్షం కారణంగా ప్రజల దైనందిన కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

సంబంధిత పోస్ట్