విజయవాడలోని కనకదుర్గమ్మ ఆలయాన్ని మంగళవారం జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి, కృష్ణాజిల్లా అధ్యక్షులు శ్రీ బండిరెడ్డి రామకృష్ణతో కలిసి సందర్శించారు. అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు పొందిన అనంతరం, అమ్మవారి కృపతో ప్రజలకు ఎల్లప్పుడూ మంచి జరగాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని వారు ప్రార్థించారు.