ధర్మవరం నియోజకవర్గంలోని 35వ వార్డులో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన "మీ సమస్య - మా బాధ్యత” కార్యక్రమంలో మంత్రి సత్య కుమార్ శుక్రవారం పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ జనసేన నాయకులు చిలకం మధుసూదనరెడ్డి తో కలసి ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరించారు. ప్రజల సమస్యలను సత్వరం పరిష్కరించాలని అధికారులను, మంత్రి కార్యాలయ సిబ్బందిని మంత్రి ఆదేశించారు.