ధర్మవరం పట్టణంలో వైకాపా నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు దిష్టిబొమ్మను శనివారం తెలుగుదేశం పార్టీ నాయకులు దగ్ధం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఈ నిరసన చేపట్టారు. అనంతరం, టీడీపీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్షుడు సుధాకర్, సీనియర్ నాయకులు కమతం కాటమయ్యతో పాటు పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.