ధర్మవరంలో పదవ తరగతి ఫలితాల్లో ప్రభుత్వ మోడల్ పాఠశాల విద్యార్థి చిట్టా లక్ష్మీ నివాస్ 600కు 592 మార్కులు సాధించి ప్రతిభ కనబరిచాడు. పట్టణంలోని 40వ వార్డులో ఉన్న ఏపీ మోడల్ పాఠశాలకు చెందిన ఈ విద్యార్థిని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పద్మశ్రీ అభినందించారు. ఈ విజయం పాఠశాలకు గర్వకారణమైంది.