మంత్రి సత్యకుమార్ యాదవ్ శుక్రవారం ధర్మవరంలో పర్యటించనున్నారు. ఆయన ముదిగుబ్బ మండలం గుంజేపల్లిలో 22-A ప్రొసీడింగ్స్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 3 గంటలకు బత్తలపల్లిలో వికసిత్ భారత్-రోజ్ గార్ అవగాహన సదస్సులో పాల్గొని, సాయంత్రం 5 గంటలకు ధర్మవరం ఎన్డీఏ కార్యాలయంలో బీజేపీ మండలాధ్యక్షుల సమావేశంలో పాల్గొంటారు.