ధర్మవరం పట్టణ వైకాపా మహిళా అధ్యక్షురాలిగా సానే వరలక్ష్మి ఎన్నికయ్యారు. ఈ నియామకంపై మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి గురువారం వరలక్ష్మిని అభినందించి, వైసీపీ ప్రభుత్వంలో మహిళా సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ ప్రతి పథకం మహిళల పేరు మీదే అమలు చేశారని గుర్తు చేశారు.