గుత్తి మున్సిపాలిటీ పరిధిలోని చెట్నేపల్లిలో రైతు తలారి రామచంద్ర ఇంటిలో శనివారం పట్టపగలే చోరీ జరిగింది. రామచంద్ర పొలానికి వెళ్లిన సమయంలో దొంగలు ఇంటి తలుపులు తెరిచి లోపలికి ప్రవేశించి, బీరువాలో దాచిన రూ.35 వేల నగదుతో పాటు 20 తులాల వెండిని అపహరించుకెళ్లారు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు దర్యాప్తు చేపట్టారు.