గుత్తి తహశీల్దార్ కార్యాలయంలో బుధవారం వీఆర్ఎలకు, వారి కుటుంబ సభ్యులకు తహశీల్దార్ పుణ్యవతి ఆధ్వర్యంలో ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో వీఆర్ఎల కుటుంబాలకు ఉచితంగా బీపీ, షుగర్, గుండె సంబంధిత పరీక్షలు చేశారు. బాడీ చెకప్ మిషన్ కొనుగోలు చేసిన కుటుంబాలు ఈ క్యాంపును సద్వినియోగం చేసుకున్నాయి. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.