పామిడి పట్టణంలోని పురాతన భోగేశ్వర స్వామి దేవాలయంలో ఆషాడమాసం మూడవ సోమవారం సందర్బంగా విశేష పూజలు, అభిషేకాలు, అలంకరణ చేశారు. స్వామి, అమ్మవార్లకు వివిధ రకాల కాయగూరలు, ఆకుకూరలు, పళ్ళు, పూలతో అలంకరణ చేశారు. దూప, దీప, నైవేద్యలు సమర్పించారు. అనంతరం మహా మంగళ హారతి గావించి తీర్థ ప్రసాదాలు అందించారు