గుంతకల్లు పట్టణంలో శనివారం తెల్లవారుజామున SBI ఏటీఎం చోరీకి దుండగులు యత్నించారు. స్థానికుల అప్రమత్తతతో ఏటీఎం మిషన్ వదిలేసి దుండగులు పారిపోయారు. ఈ ఘటనలో ఏటీఎం అద్దాలు ధ్వంసమయ్యాయి. సీసీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏటీఎం మిషన్లో సుమారు రూ. 30 లక్షల నగదు ఉన్నట్లు అధికారులు తెలిపారు.