హిందూపురం రూరల్ మండలం దేవరపల్లి సమీపంలో రాజస్థాన్కు చెందిన చంద్రబాన్ (28) అనే వలస కార్మికుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ఆత్మహత్యకు గల కారణాలపై విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.