నంబులపూలకుంట మండలం గౌకనపేటకు చెందిన సోమగిరి అమరయ్య (58) శనివారం ఉదయం తన ఇంటి సమీపంలోని చింత చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారని ఎస్సై కృష్ణమూర్తి తెలిపారు. అమరయ్య దీర్ఘకాలంగా ఆస్తమా వ్యాధితో బాధపడుతుండేవాడని, జీవితంపై విసుగు చెంది ఈ ఘటనకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైందని చెప్పారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.