విషాదం: ఈతకు వెళ్లి.. తండ్రీకొడుకులు మృతి

సత్యసాయి జిల్లా నల్లచెరువు మండలం బందార్లపల్లి గ్రామంలో హంద్రీనీవా కాలువలో ఈతకు వెళ్లి తండ్రీకొడుకులు గల్లంతయ్యారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. స్థానిక యువకులు, ఈతగాళ్లు వెంటనే గాలింపు చర్యలు చేపట్టారు. తండ్రి మృతదేహం లభించినప్పటికీ, కొడుకు ఆచూకీ ఇంకా లభించలేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం అందాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్