కళ్యాణదుర్గం రూరల్ సర్కిల్ పరిధిలో జూదాలు నిర్వహిస్తున్న అనుమానితులకు డీఎస్పీ రవిబాబు కౌన్సెలింగ్ ఇచ్చారు. జూదాలకు పూర్తిగా దూరంగా ఉండాలని, లేనిపక్షంలో కఠిన చర్యలతో పాటు జిల్లా బహిష్కరణ తప్పదని హెచ్చరించారు. యువత జూదాల బారిన పడకుండా కుటుంబసభ్యులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.