కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు ఆదివారం కసాపురం శ్రీనెట్టి కంటి ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, అర్చకులు ఆయనకు స్వాగతం పలికి, స్వామికి ఆకుపూజ చేయించారు. స్వామి వారి శేషవస్త్రం, తీర్థప్రసాదాలను అందజేసి, ఆశీర్వదించారు. కళ్యాణదుర్గం నియోజకవర్గం ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని ఆయన స్వామికి ప్రత్యేక పూజలు చేయించారు.