శుక్రవారం కళ్యాణదుర్గంలో కనకదాసు విగ్రహావిష్కరణ సందర్భంగా మంత్రి లోకేష్ పుట్టపర్తి ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. ఆయనకు ఎంపీ పార్థసారథి, మంత్రి పయ్యావుల కేశవ్, ఎమ్మెల్యేలు అమిలినేని సురేంద్రబాబు, సింధూర, ఎమ్మెస్ రాజు, కందికుంట వెంకటప్రసాద్, బండారు శ్రావణి, కలెక్టర్ శ్యాంప్రసాద్, జేసీ మౌర్య భరద్వాజ్ పుష్పగుచ్ఛాలు అందజేసి ఘనస్వాగతం పలికారు. అనంతరం మంత్రి రోడ్డు మార్గాన కళ్యాణదుర్గం వైపు బయలుదేరారు.