కళ్యాణదుర్గం పట్టణానికి చెందిన భాగ్యశ్రీ, మల్లీశ్వరి అనే నర్సింగ్ విద్యార్థినులు పేదరికం వల్ల ఫీజులు చెల్లించలేక చదువు ఆపేశారు. ఈ విషయం తెలుసుకున్న ఉపాధ్యాయుడు బద్దే నాయక్, ఇన్ఫినిటీ ఛారిటబుల్ ట్రస్ట్ తరఫున రూ. 35వేలు కళాశాలకు చెల్లించి వారి చదువుకు అండగా నిలిచారు. ఉన్నత విద్యకు పేదరికం అడ్డురాకూడదని ఆయన అన్నారు.