మడకశిర పట్టణంలో బుధవారం బార్ అసోసియేషన్ కార్యాలయంలో న్యాయవాదుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాది గోవిందప్ప మాట్లాడుతూ, భారత దేశ మొదటి రాష్ట్రపతి డాక్టర్ బాబు రాజేంద్రప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా న్యాయవాదుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆయన సేవలను స్మరించుకున్నారు.