మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు బుధవారం మడకశిర పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో హంద్రీనీవా ఇరిగేషన్ కాలవ ఇంజనీర్లతో సమావేశమయ్యారు. మడకశిర నియోజకవర్గంలోని అన్ని చెరువులకు హంద్రీనీవా కాలువ ద్వారా కృష్ణ జలాలను సాధ్యమైనంత త్వరగా నింపాలని, తద్వారా సాగునీరు, తాగునీటి సమస్యలు లేకుండా చూడాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో ఇంజనీర్లు పాల్గొన్నారు.