మడకశిర మండలంలోని గోల్డెన్ త్రెడ్స్ అనే ప్రైవేట్ గార్మెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న మహిళా కూలీలు సోమవారం ధర్నా చేపట్టారు. మూడు నెలలుగా జీతాలు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని మడకశిర అమరాపురం రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. మహిళల ధర్నాతో ట్రాఫిక్ కు భారీగా అంతరాయం ఏర్పడింది.