రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వైఖరికి నిరసనగా వైసీపీ చేపట్టిన చలో పోతిరెడ్డిపాడు కార్యక్రమానికి మడకశిర వైకాపా నాయకులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వైకాపా ఇన్చార్జి లక్కప్ప, రంగే గౌడ్, నాగభూషణ్ రెడ్డి, మడకశిర మండల కన్వీనర్ రామిరెడ్డి, బూత్ కమిటీ కార్యదర్శులు పాల్గొన్నారు. ప్రాజెక్టుపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఈ నిరసన చేపట్టారు.