మడకశిర వైకాపా కార్యాలయంలో గురువారం పార్టీ క్యాడర్ కు సంబంధించి ఐడి కార్డ్ వెరిఫికేషన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ అబ్జర్వర్ రఘునాథ్ రెడ్డి, మడకశిర ఇన్చార్జ్ ఈర లక్కప్ప ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా, పంచాయతీ కన్వీనర్లు, యువజన విభాగం అధ్యక్షులు, ఐటి విభాగం నాయకులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి, పార్టీ విధివిధానాలను ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో అవగాహన కల్పించారు. పార్టీని మరింత బలోపేతం చేయడంపై ఈ సమావేశంలో చర్చించారు.