పెనుకొండలో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయండి

పెనుకొండ పట్టణంలో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరుతూ, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ ను మంత్రి సవిత కలిసి వినతి పత్రం అందజేశారు. పెనుగొండ ప్రజలు కిడ్నీ డయాలసిస్ చికిత్స కోసం సుదూర ప్రాంతాలకు వెళుతున్నారని, వారి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని డయాలసిస్ సెంటర్ మంజూరు చేయాలని మంత్రి సవిత కోరారు. ఈ వినతితో స్థానిక ప్రజల ఆరోగ్య అవసరాలు తీరనున్నాయని భావిస్తున్నారు.

సంబంధిత పోస్ట్