రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత బుధవారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయాన్ని సందర్శించారు. అక్కడ వివిధ సమస్యలపై వచ్చిన సందర్శకులతో కలిసి భోజన విరామ సమయంలో భోజనం చేశారు. వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. మంత్రి స్వయంగా వివరాలు అడగడంతో సందర్శకులు సంతోషం వ్యక్తం చేశారు.