సోమందేపల్లి మండల కేంద్రంలో ఫిబ్రవరి 1వ తేదీ ఆదివారం జరిగే భక్త కనకదాసు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి మంత్రి సవితను శుక్రవారం కురుబ సంఘం నాయకులు ఆహ్వానించారు. పెనుకొండ పట్టణంలోని క్యాంప్ కార్యాలయంలో కురుబ సంఘం నాయకులు మంత్రి సవితను కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ కార్యక్రమంలో గంగాధరప్ప, శ్రీనివాసులు, సిద్దలింగప్ప, రామకృష్ణ, శ్రీరాములు, నారాయణ, శివ తదితరులు పాల్గొన్నారు.