పెనుకొండ మండలంలోని రాంపురం వద్ద ఉన్న ఎంజేపీ పాఠశాలలో గురువారం నిర్వహించిన మెగా పేరెంట్స్ కార్యక్రమంలో మంత్రి సవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సమాజంలో ఎవరూ ఏ వృత్తి చేపట్టినా, వారిని తీర్చిదిద్దేది ఉపాధ్యాయులేనని, విద్య ద్వారానే సామాజిక మార్పు సాధ్యమవుతుందన్నారు. సీఎం చంద్రబాబు విజనరీ ఆలోచనలతో మన విద్యా వ్యవస్థ దేశానికే ఆదర్శంగా ఉండేలా ఆంధ్ర మోడల్ తీసుకొస్తున్నామన్నారు.