సత్య సాయి జిల్లా కలెక్టర్ శ్యాం ప్రసాద్ మంగళవారం బుక్కపట్నం మండలం సిద్దరాంపురం పంచాయతీ కొట్టాలపల్లిలో పర్యటించారు. ఉపాధి హామీ పథకం కింద ఏర్పాటు చేసిన డ్రైలాండ్ హార్టికల్చరల్ మామిడి తోటల్లో నీటి నిల్వ గుంతలను ఆయన పరిశీలించారు. రైతులను వెంటబెట్టుకొని, వారి పంటల గురించి అడిగి తెలుసుకున్నారు.