కొత్తచెరువులో ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న జయంతి సందర్భంగా ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వడ్డే ఓబన్న తొలి తరం స్వాతంత్ర ఉద్యమంలో కీలకపాత్ర వహించారని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి తెలిపారు. ఆయన ధైర్య సాహసాలు నేటితరం యువత ఆదర్శంగా తీసుకోవాలని ఆయన సూచించారు.