పుట్టపర్తి లో ఘనంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

పుట్టపర్తిలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ కోసం కష్టపడిన నాయకులు, కార్యకర్తలను గుర్తించి సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డితో పాటు పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్