గురువారం రాత్రి సత్యసాయి జిల్లా పుట్టపర్తి పట్టణంలో కురిసిన భారీ వర్షం, ఉరుములు, మెరుపులతో బీభత్సంగా మారింది. అర్థరాత్రి ఎనుములపల్లి గ్రామంలోని నారపరెడ్డి ఇంటి వెనక కొబ్బరి చెట్టుపై పిడుగు పడటంతో అది అగ్నికి ఆహుతైంది. ఈ ఘటనతో పాటు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.