బెలుగుప్పలో చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

బెలుగుప్ప మండలం గంగవరం సమీపంలో ఈనెల 6న జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన హనుమంతరాయుడు శనివారం రాత్రి మృతి చెందారు. కూరాకుల తోటకు చెందిన ఆయన బైక్పై వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొంది. తొలుత కళ్యాణదుర్గం ఆసుపత్రికి, మెరుగైన చికిత్స కోసం కర్నూలుకు తరలించగా అక్కడ ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్