రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత శ్రీశైల క్షేత్రాన్ని సందర్శించి, భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఈవో, అధికారులు ఆమెకు స్వాగతం పలికారు. దర్శనానంతరం అర్చకులు ఎమ్మెల్యేకు వేద ఆశీర్వచనం అందజేసి తీర్థ ప్రసాదాలు అందించారు.