కుందుర్పి మండలం కరిగానిపల్లికి చెందిన టీడీపీ కార్యకర్త హరిప్రసాద్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. మొదట కళ్యాణదుర్గం ఆసుపత్రికి తరలించగా, అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలించారు. ఈ విషయం తెలుసుకున్న కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు మేనల్లుడు, టీడీపీ సీనియర్ నాయకుడు ధర్మతేజ బుధవారం అనంతపురం వెళ్లి హరిప్రసాద్ను పరామర్శించారు.