కుందుర్పి మండలం నిజవల్లిలో శనివారం రేఖ అనే యువతి పురుగు మందు తాగి అపస్మారక స్థితికి చేరుకుంది. కుటుంబ సభ్యులు ఆమెను కళ్యాణదుర్గం ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమించడంతో అనంతపురం తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. ఈ ఘటనపై ఎస్ఐ మహేశ్ దర్యాప్తు చేపట్టారు.