డి. హిరేహాల్ మండలం మడేనహళ్లిలో డబ్బుల విషయంలో తల్లిదండ్రులతో జరిగిన చిన్నపాటి గొడవ కారణంగా మనస్తాపం చెందిన శివరాజ్(22) శుక్రవారం రాత్రి ఇంటి నుంచి వెళ్లిపోయి, శనివారం తెల్లవారుజామున గ్రామ సమీపంలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గురుప్రసాద్ రెడ్డి తెలిపారు.