శుక్రవారం, టీడీపీ జిల్లా అధ్యక్షుడి పూల నాగరాజు కాన్వాయ్ గుండ్లపల్లి నుంచి రాయదుర్గంకు వస్తుండగా కదరంపల్లి టోల్ గేట్ సమీపంలో ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న వాహనం అకస్మాత్తుగా బ్రేకులు వేయడంతో వెనుక ఉన్న వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఆరు వాహనాలు దెబ్బతిన్నాయి. కొందరికి స్వల్ప గాయాలవడంతో వారిని రాయదుర్గం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.