శింగనమల: ప్రజాదర్బార్ లో వినతుల స్వీకరణ

శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ శుక్రవారం జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించారు. నియోజకవర్గ ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోరుతూ ఎమ్మెల్యేకు వినతిపత్రాలు అందజేశారు. ఎమ్మెల్యే వాటిని స్వీకరించి, పరిశీలించిన అనంతరం, సమస్యలను త్వరగా పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్