అనంతపురం జిల్లా యల్లనూరు జడ్పీటీసీ విజయప్రతాప్ రెడ్డిపై జరిగిన దాడిని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్రంగా ఖండించారు. బాధితుడి తండ్రికి ఫోన్ చేసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే దాడులకు దిగడం హేయమని, ప్రజలే తగిన బుద్ధి చెబుతారని జగన్ మండిపడ్డారు. పార్టీ నాయకులకు ధైర్యంగా ఉండాలని, అందరికీ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.