తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్లను కలిసి తాడిపత్రి మున్సిపాలిటీ అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. ఇటీవల ప్రారంభించిన సోలార్ ప్లాంట్ ద్వారా నెలకు 22 లక్షల రూపాయల విద్యుత్ బిల్లు ఆదా అవుతుందని తెలిపారు. హిందూ స్మశానవాటికలో జరుగుతున్న అభివృద్ధి పనులు, కొత్త షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు గురించి కూడా చర్చించారు.