పెద్దవడుగూరు మండలం కోనాపురంలోని ఓ స్టోరేజ్ పాయింట్లో గుర్తు తెలియని వ్యక్తులు కన్నం వేసి, సుమారు రూ. 8 లక్షల విలువైన పేలుడు పదార్థాలను దొంగిలించారు. ఈ ఘటనపై స్టోరేజ్ పాయింట్ నిర్వాహకుడు కిరణ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.