JC అనుచరులు బరితెగిస్తున్నారు: కేతిరెడ్డి

టీడీపీ శ్రేణుల దాడిలో గాయపడిన వైసీపీ కార్యకర్తలు లక్ష్మీనాథ్ రెడ్డి, వెంకటలక్ష్మిని అనంతపురంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించి, వైద్యులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. మెరుగైన చికిత్స అందించాలని కోరారు. ఈ సందర్భంగా JC అనుచరులు బరితెగిస్తున్నారని పెద్దారెడ్డి మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్