ఉరవకొండ నియోజకవర్గంలోని గ్రామ సంఘాల సహాయకులు (VOA) కోసం రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు సెల్ఫోన్లను పంపిణీ చేశారు. నియోజకవర్గవ్యాప్తంగా సుమారు 200 మంది VOAలకు మంత్రివర్యులు ఆధునిక 5G స్మార్ట్ఫోన్లను అందజేసారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు మరింత సమర్థవంతమైన సేవలు అందించేందుకు మహిళా సంఘాలను బలోపేతం చేసే దిశగా కూటమి ప్రభుత్వం కీలక అడుగు వేసింది అని మంత్రి తెలిపారు.